VKB: కొడంగల్ మండలం కస్తూర్ పల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ శ్రీశైలం గౌడ్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.