MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99వ ‘ప్రజా పాలన-ప్రజా ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సందడి నెలకొంది. పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో ‘ప్రజల వద్దకే పాలన’ అనే నినాదంతో మున్సిపల్ యంత్రాంగం శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.