KRNL: ఆదోని నియోజకవర్గం బసాపురం గ్రామంలో మేక వంకపై వంతెన నిర్మించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అదనంగా సర్వే నంబర్లు 20, 21, 64, 47 లో నివాసం కలిగిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఉపసభాపతి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.