NLG: హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింగ్వి, వేం నరేందర్ రెడ్డిలకు మద్దతు తెలుపుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.