PDPL: ఈనెల 6 నుంచి 15 వరకు గ్రామ, పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో 99 రోజుల కార్యాచరణ పై డీసీపీ రామ్ రెడ్డి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలన్నారు. రోడ్లపై చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.