KMM: ముదిగొండ మండలంలో గురువారం ఓ గర్భిణీ 108 వాహనంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ఇందిరమ్మ కాలనీకి చెందిన లల్లీ (24) అనే గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో వాహనంలోనే ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.