BPT: పర్చూరు మండలం దేవరపల్లిలో రూ. 35 లక్షల వ్యయంతో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం స్థానిక నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రహదారుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు రోడ్ల నిర్మాణం ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.