BHNG: శ్రీ లక్ష్మినరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.3,61,780, కార్ పార్కింగ్ రూ. 1,07,500, VIP దర్శనాలతో రూ.1,05,000, బ్రేక్ దర్శనాలతో రూ.50,400, ప్రధాన బుకింగ్ రూ. 85,150, వ్రతాలతో రూ.34,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.8,18,368, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.