PLD: బ్యాంకులకు నిర్దేశించిన అన్ని రకాల రుణాల లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం జిల్లా డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు.