CTR: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పశువైద్య కేంద్రంలో పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలను 50% సబ్సిడీపై పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు హాజరై యంత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రూ.40,500ల విలువ గల యంత్రాన్ని రూ.20,250కే అందిస్తున్నట్లు తెలిపారు.