W.G: తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం రుణమేళా, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూనియన్ బ్యాంక్ కౌన్సిలర్ రాజేశ్ బాబు సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఎస్తేరు రాణి, జీ. బేబీ, శ్రీదేవి, సీసీలు సునీత పాల్గొన్నారు.