AP: రాష్ట్ర అసెంబ్లీలో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. హోంమంత్రి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇకపై 30 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వాణిజ్య, నివాస భవనాలకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలను సీజ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.