TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం, సమ్మక్క బ్యారేజీ పనులపై మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టును ఈ మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేస్తామని, భూసేకరణ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్(D)లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.