WNP: వేసవి కాలంలో పలువురు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తారు. ఇంటి యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎప్పుడూ ఇంటి పరిసరాలను చరవాణుల్లో ప్రత్యక్షంగా చూడొచ్చన్నారు. కాలనీల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సూచించారు. పోలీస్ కంట్రోల్ రూంకు అందిస్తే నేరుగా నిఘాను తాము చూసే అవకాశం ఉంటుందన్నారు.