AP: నకిలీ నోట్ల చలామణి కేసులో ఏడుగురు నిందితులకు విశాఖలోని NIA ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులు అసోం, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 2015లో వారు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి చలామణి చేసినట్టు NIA నిర్ధారించింది.