కోనసీమ: ఈ నెల 22న రామచంద్రపురం ఉపాధి భవన్లో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 18 నుంచి 27 ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఐటిఐ చదివిన అభ్యర్థులకు రూ.18 వేల జీతంతో షిఫ్ట్ టైంలో భోజన, రవాణా సదుపాయం కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.