ఢిల్లీ లిక్కర్ కేసులో ఆ రాష్ట్ర మాజీ CM కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సహా పలువురికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ CBI ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చే క్రమంలో సదరు ట్రయల్ కోర్టు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని CBI పేర్కొంది.