AP: కర్నూలు జిల్లా ఆదోనిలో విరూపాక్షిస్వామి, వీణ వివాహం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. విరూపాక్షి స్వామి స్నేహితులతో కలిసి జనసేవ సామాజిక సంస్థ ఏర్పాటు చేసి, పదేళ్లుగా రక్తదానం, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వివాహ వేడుకల్లోనూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అయితే, వివాహ వేడుకల్లో వరుడితోపాటు పెళ్లికి వచ్చిన అతిథుల్లో 27 మంది రక్తదానం చేశారు.