రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదాడు. స్టార్ ప్లేయర్లు రాహుల్(13), పడిక్కల్(11), కరుణ్ నాయర్(0) విఫలమైనప్పటికీ అగర్వాల్ 110 పరుగులతో ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రంజీల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్(584) తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కర్నాటక(174/5) మరో 410 పరుగులు వెనుకబడి ఉంది.