E.G: దివాన్ చెరువులోని ఫారెస్ట్ ఏరియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. బొమ్మూరు ఎస్సై రమేష్ తెలిపిన వివరాలు.. ‘మృతదేహం ఉన్న స్థితిని బట్టి చనిపోయి నాలుగైదు రోజులు అయి ఉండవచ్చు. అక్కడ లభించిన సెల్ ఫోన్ ఆధారంగా మృతుడు రాజవోలుకు చెందిన మాండ్రు ప్రశాంత్ కుమార్ (43)గా గుర్తించాం’ అని పేర్కొన్నారు.