మారుతి సుజుకి డిజైర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2008లో లాంచ్ అయిన ఈ సెడాన్, ఇప్పటివరకు 30 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది. 2025లో 2.14 లక్షల కార్లు అమ్ముడై దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 4వ తరం మోడల్లో సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉండటం దీనికి కలిసి వచ్చింది. లీటరుకు 24.79 కిమీ మైలేజీ ఇవ్వడం దీని ప్రత్యేకత.