NLR: గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలో కొత్తగా నిర్మించిన ఈద్గాను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం రాత్రి ప్రారంభించారు. ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. ఈద్గా అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.