MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు కల్పించి ప్రతిమా ఫౌండేషన్, కరీంనగర్ నిర్వాహకులు మంచి మనసును చాటుకున్నారు. వాలా విజయ జగన్నాధ రావు జ్ఞాపకార్థం ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ వారి సౌజన్యంతో బోయినపల్లి ఉషారాణి, బోయినపల్లి హరిణి, వాల అశోక్ రావు సోమవారం బాదంపల్లి జడ్పీ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.