MNCL: పరిశుభ్రతకు అందరూ పెద్ద పీట వేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజా పాలన -అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే గ్రామ, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.