BDK: మణుగూరు మండలం చిన్నరావిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుంజా నాగేశ్వరరావు (55) ఆదివారం మృతి చెందారు. ఆయన మరణం పట్ల మణుగూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పికినారి నవీన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.