సత్యసాయి: పరిగి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ఎంపీడీవో రెడ్డప్ప ఆధ్వర్యంలో మండల అధికారులు, స్థానిక నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి నీటి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.