NRML: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో యువ నాయకుడు యాసీన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, నియమం, దానం, దైవ భక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.