విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ శంఖ భ్రత బాగ్చి పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘ఇన్స్పైర్ ఉమెన్’, ‘ప్రౌడ్ ఆఫ్ వైజాగ్’ అవార్డులను ప్రదానం చేశారు.