కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టర్ ఛాంబర్లో 2026-27 సంవత్సరానికి నూతనంగా మంజూరైన మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీడియా ప్రజల మరియు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. బాధ్యతాయుతంగా, నిజనిర్ధారణతో వార్తలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.