TG: ఏపీలోని వేట్లపాలెంలోని బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించి 18 మంది మరణించారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో క్షతగాత్రులైన వారికి వెంటనే మెరుగైన చికిత్సను అందించాలని ప్రభుత్వానికి సూచించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.