హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌తో మ్యాచ్‌లు ఆడకూడదు: మదన్ లాల్

మహిళల ఆసియా కప్ ట్రోఫీ ప్రదానోత్సవంలో జరిగిన వివాదంపై 1983 వరల్డ్ కప్ విజేత మదన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తీరు మారకపోతే ఏ టోర్నమెంట్‌లోనూ ఆ దేశంతో భారత్ మ్యాచ్‌లు ఆడకూడదని స్పష్టం చేశాడు. అయితే, తుది నిర్ణయం మాత్రం బీసీసీఐదేనని తెలిపాడు. కాగా, ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.