టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20లో సూర్యవంశీని పక్కనపెట్టి, సంజూ శాంసన్ను ఏ లెక్కన ఓపెనర్గా ఆడించారని ప్రశ్నించాడు. జింబాబ్వే టూర్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన వైభవ్ను కాదని, సంజూను ఆడించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, సంజూ 10 పరుగులే చేసి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
క్రీడలు
సంజూను ఎందుకు ఆడించారు?: కైఫ్


