భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు BCCIలో మార్పులు రావాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ సూచించాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే వంటి మాజీలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. ఇటీవల దులీప్ ట్రోఫీ ఫైనల్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్ వ్యవస్థతో పాటు బీసీసీఐ ఆలోచనా విధానంలో మరింత విస్తృతమైన మార్పులు అవసరమన్నాడు.
క్రీడలు
'బీసీసీఐలో కీలక మార్పులు అవసరం'


