హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదు.. స్పందించిన ట్రాయ్

వొడాఫోన్ ఐడియా తమ నెట్‌వర్క్‌కు మారే వినియోగదారులకు ప్రత్యేక టారిఫ్ ప్రయోజనాలు ఇస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఎయిర్‌టెల్, జియో ట్రాయ్‌కి ఫిర్యాదు చేశాయి. ప్రమోషన్లను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరగా, ఆందోళనలను పరిశీలిస్తామని ట్రాయ్ ఛైర్మన్ ఏకే లహోతీ తెలిపారు. అయితే తాము చట్టానికి లోబడే ఆరోగ్యకరమైన పోటీని కోరుకుంటున్నామని Vi స్పష్టం చేసింది.