హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాలను సందర్శించిన బాషా

కడప: నగరంలోని పలు వినాయక మండపాలను మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్‌ బాషా,సీఈసీ సభ్యులు కె. సురేష్‌బాబు, మాజీ మేయర్ పాక సురేష్‌తో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.