ADB: తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయి 277.50 మీటర్లకు చేరిందని AEE హరీష్ ఇవాళ తెలియజేశారు. ప్రాజెక్ట్ సవరించిన పూర్తి సామర్థ్యం 0.470 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు 503.40 మి.మీ వర్షపాతం నమోదైందని AEE హరీష్ పేర్కొన్నారు.
తెలంగాణ
మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు ఇవే!


