హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్తాలు మీదపడి కార్మికుడి మృతి

HNK: రైస్‌మిల్లులో ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్తాలు మీదపడటంతో బిహార్‌కు చెందిన హమాలీ జటాన్‌మాండి (36) మృతి చెందారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి శివారులోని శ్రీనిధి రైస్‌మిల్లులో ఆదివారం ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తోటి హమాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.