హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి గణపతులనే పూజించాలి'

MDCL: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్టించాలని మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అన్నారు. 1వ వార్డులోని బోయనపల్లి మైదానంలో లవ్ యువర్ నేబర్ లవ్ యువర్ సెల్ఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు వాసు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో మట్టి గణపతులను పంపిణీ చేసారు.