హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈగల్ టీం సహకారంతో తనిఖీలు

AKP: ఎస్.రాయవరం పోలీసులు ఈగల్‌ టీం సహకారంతో తిమ్మాపురం శివారులోని స్మశానవాటిక ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. బయో చెక్‌ కిట్లతో పరీక్షించగా ఒకరికి గంజాయి పాజిటివ్‌‌గా తేలిందన్నారు. పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తామన్నారు.