హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారిన పేరు.. గందరగోళం ప్రజలు..!

NRML:ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో గ్రామాల పేర్ల నమోదులో గందరగోళం నెలకొంది. మండలంలోని రాచాపూర్‌ గ్రామ లబ్ధిదారులకు అందిన కార్డుల్లో రాచాపూర్‌కు బదులుగా పొట్టపెల్లి(కే) గ్రామం పేరు నమోదైంది. గతంలో రాచాపూర్‌కు అనుబంధ గ్రామంగా ఉన్న పొట్టపెల్లి(కే) ప్రస్తుతం ప్రత్యేక గ్రామపంచాయతీతో పాటు రెవెన్యూ గ్రామంగా గుర్తింపు పొందింది.