MDK: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అవమానకర ఘటనను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఖండించారు. తెలంగాణ భవన్లో జరిగిన మాక్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తారనే భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వం గొంతు నొక్కుతోంది: ఎమ్మెల్యే


