హైదరాబాద్: 28°C
క్రైమ్

240 మందితో వెళ్తున్న నౌక ఆచూకీ గల్లంతు

ఇండోనేషియాలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక జావా సముద్రంలో ప్రమాదానికి గురైంది. 'విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8' నౌక తూర్పు జావా నుంచి దక్షిణ కాలిమంతన్‌కు వెళ్తుండగా గల్లంతైంది. నౌకలో సమాచార లోపం తలెత్తినట్లు అధికారులు తెలిపారు. నౌక ఆచూకీని చివరిగా బంజర్‌మాసిన్‌కు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.