హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా ముగిసిన జాతీయ లోక్‌ అదాలత్

NLG: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతమైంది. నల్గొండ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో కక్షిదారుల సౌకర్యార్థం మొత్తం 14 లోక్‌ అదాలత్‌ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌‌లో 12,283 (పెండింగ్‌ మరియు ప్రీ-లిటిగేషన్‌) కేసులు పరిష్కారమయ్యాయని అధికారులు వెల్లడించారు.