హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైకల్యాన్ని దాటి.. జిల్లా వాసికి స్వర్ణం

KMR: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన WAKO 1వ పారా కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కామారెడ్డి జిల్లా గూడెం గ్రామానికి చెందిన గుడుగుల అరవింద్ కుమార్ సత్తా చాటారు. P1 కేటగిరీలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. అరవింద్ విజయంపై జిల్లా ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.