హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోక్‌ అదాలత్‌లో 247 కేసుల పరిష్కారం

కోనసీమ: అమలాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మూడు బెంచ్‌ల ద్వారా మోటారు ప్రమాద పరిహారం, సివిల్‌, క్రిమినల్‌, బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర కేసులను పరిష్కరించారు. మొత్తం రూ.3.65 కోట్లకుపైగా విలువైన 247 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి.