హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్‌ అదాలత్‌లో 41 కేసులు పరిష్కారం'

KMM: మధిర కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో వైరా పోలీస్‌స్టేషన్‌ సీడీవో దుగ్గిదేవర నరసింహారావు 41 క్రిమినల్‌ కేసుల్లో రాజీ కుదిర్చారు. కక్షిదారులకు లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలు వివరించి, సయోధ్యకు కృషి చేసినందుకు మేజిస్ట్రేట్‌ వేముల దీప్తి ఆయనకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.