హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

PPM: కురుపాం (మం) బియ్యాలవలస పంచాయతీ దుర్బిలి గ్రామానికి చెందిన 12 మంది పీఎం జన్ మన్ గృహాల కోసం పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతిపత్రం అందించారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను వివరించారు. సర్వే నంబర్ 21-2లో ప్రభుత్వ భూమి ఉందని, పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు.