NGKL: బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి తిలతైలాభిషేకం, శని గ్రహదోష నివారణ పూజలు జరిపించారు. అలాగే పరమశివునికి రుద్రాభిషేకం, నందీశ్వరునికి ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు


