హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి తీరంలో నిర్వహించనున్న సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఆహ్వానించారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన మంత్రి.. ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల వివరాలను గవర్నర్‌కు వివరించారు.