హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ల్యాబొరేటరీని ప్రారంభించిన సీఎం

PLD: నరసరావుపేట లింగంగుంట్ల ఏరియా హాస్పిటల్‌లో రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేసిన అధునాతన ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.